Friday, March 29, 2024

పెద్దమ్మ తల్లి ఆశీర్వచనంతో రేవంత్ ర్యాలీ

టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న నేపధ్యంలో రేవంత్‌రెడ్డి పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజుల చేశారు. ఉదయమే ఆయన నివాసం వద్ద వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఆ తరువాత తన నివాసం నుంచి బయలుదేరి జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడికి చేరుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేవంత్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. అనంతరం గాంధీభవన్‌కు రేవంత్ ర్యాలీగా బయల్దేరారు. గాంధీభవన్‌లో మధ్యాహ్నం 1.30 గంటలకు టీపీసీసీ తాజా మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నుంచి రేవంత్‌ బాధ్యతలు స్వీకరిస్తారు. తదుపరి గాంధీభవన్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగిస్తారు. రేవంత్ ర్యాలీకి అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలి వచ్చాయి. రేవంత్ వెంట ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ మల్లు రవి, కాంగ్రెస్ నేతలు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement