Sunday, April 28, 2024

తెలంగాణ సీఎంపై హత్యాయత్నం కేసు నమోదు చేసినా తప్పులేదు: విజయశాంతి

ఏపీ అంబులెన్సులను సరిహద్దుల్లో అడ్డుకుంటోందంటూ బీజేపీ మహిళా నేత విజయశాంతి తెలంగాణ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రుల్లో బెడ్ కన్ఫర్మ్ చేసుకున్నా, అందుకు రుజువులు చూపిస్తున్నా అనుమతించకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. సరిహద్దుల్లో అంబులెన్సులను ఆపే విషయమై ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయా? అన్న హైకోర్టు ప్రశ్నకు సైతం అధికారులు సరైన సమాధానం ఇవ్వలేకపోయారని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వ తీరుతో సరిహద్దుల వద్ద పలువురు రోగులు మృత్యుముఖానికి చేరువయ్యే పరిస్థితి నెలకొందని తెలిపారు. ఈ దుస్థితికి కారకుడిగా భావించి తెలంగాణ సీఎంపై హత్యాయత్నం కేసు నమోదు చేసినా తప్పులేదని విజయశాంతి స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement