Sunday, April 28, 2024

MLC VAMSHI: సంక్రాంతి త‌ర్వాత విశాఖ వైసిపి మొత్తం ఖాళీ – ఎమ్మెల్సీ వంశీ కృష్ణ

విశాఖ‌ప‌ట్నం – సంక్రాంతి త‌ర్వాత విశాఖప‌ట్నం వైసిపి మొత్తం ఖాళీ అవుతుంద‌ని జోస్యం చెప్పారు ఎమ్మెల్సీ, జనసేన విశాఖ అధ్యక్షుడు వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్‌. విశాఖ‌లో నేడు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ జనసేన పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయన్నారు.

ప్ర‌స్తుతం వైసిపి ఒక్క నేత కూడా ఉంటే ప‌రిస్థితులు లేవ‌ని, ఏ పార్టీలోకి దూకుదామా అని ఫ్యాన్ లీడ‌ర్లు మంత‌నాలు జ‌రుపుతున్నార‌ని చెప్పారు. ఇది ఇలా ఉంటే సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకొచ్చిన నవరత్నాల్లో రెండు రత్నాలు ఇవే అంటూ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, వాసుప‌ల్లి గ‌ణేష్ ల‌ పై విరుచుకుపడ్డారు. జీవి అనే వ్యక్తి ఎప్పుడైనా ఒక జెండా పట్టుకున్నారా..? జెండా రంగులు తెలుసా..? అని ప్రశ్నించారు. విశాఖలో ఉన్న బిల్డర్స్, ఎంవీవీ, జీవీల‌ను చూసి భయపడుతున్నారన్నారు. వేరే రాష్ట్రాలకు వెళ్లిపోవాలని చూస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నిక‌ల అనంత‌రం విశాఖ మేయర్ పదవి కోసం ఆలోచిస్తామ‌ని, మెజార్టీ వైసీపీ కార్పొరేటర్లు మాతో టచ్ లో ఉన్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement