Wednesday, May 15, 2024

IND vs AUS | 23నుంచి టీ20 సిరీస్.. విశాఖ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు!

ఈ నెల 23 నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా 5 మ్యా్చ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు విశాఖపట్నం ఆతిథ్యమివ్వనుంది. కాగా, ఈ సిరీస్ లో సూర్యకుమార్ యాదవ్ భారత్‌కు నాయకత్వం వహించనున్నట్టు తెలుస్తొంది. ఇక ఈ సిరీస్ కోసం ఇప్పటికే పలువురు టీమిండియా ఆటగాళ్లు వైజాగ్ చేరుకున్నారు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, ముఖేశ్ కుమార్, అర్షదీప్ సింగ్, జితేశ్, రింకూ సింగ్ తదితరులు విశాఖలో అడుగుపెట్టారు.

అంతేకాదు, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పరుగుల వెల్లువ సృష్టించిన రియాన్ పరాగ్ ఆస్ట్రేలియాతో సిరీస్ కు ఎంపికయ్యే అవకాశాలున్నాయి. ఇక, ODI ప్రపంచ కప్ తరువాత భారత ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవికాలం ముగిసింది. దీంతో ఈ టీ20 సిరీస్ లో టీమిండియా కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరిస్తారని తెలుస్తోంది.

టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే…

నవంబరు 23- తొలి టీ20 (విశాఖపట్నం)
నవంబరు 26- రెండో టీ20 (తిరువనంతపురం)
నవంబరు 28- మూడో టీ20 (గువాహటి)
డిసెంబరు 1- నాలుగో టీ20 (నాగపూర్)
డిసెంబరు 3- ఐదో టీ20 (హైదరాబాద్)

Advertisement

తాజా వార్తలు

Advertisement