Tuesday, April 30, 2024

కంపెనీలో గ్యాస్ లీక్.. బాధితులను పరామర్శించిన మంత్రి అమర్నాథ్..

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం స్పెష‌ల్ ఎక‌న‌మిక్ జోన్ (సెజ్‌)లో ఉన్న సీడ్స్‌ దుస్తుల కంపెనీలో విషవాయువు లీకై 95 మంది మహిళా కార్మికులుఅస్వస్థకు గురైన విష‌యం తెలిసిందే. వీరు ఎన్టీఆర్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో బాధితులను ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్‌ పరామర్శించారు. సీడ్స్‌ కంపెనీ మూసేయాలని ఆదేశించామని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు కూడా ఈ కంపెనీలో గ్యాస్‌ లీకైందని మంత్రి వెల్లడించారు. పరిశ్రమలకు సేఫ్టీ ఆడిట్‌ లేకపోతే కంపెనీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement