Sunday, May 5, 2024

కొవిడ్ రెండో డోస్ కోసం పోటెత్తిన జ‌నం…చెస్ట్ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత…

విశాఖప‌ట్నం – కొవిడ్ వ్యాక్సిన్ రెండో డోస్ నేటి నుంచి వేస్తామ‌ని వైద్య శాఖ అధికారుల ప్ర‌క‌ట‌న‌తో విశాఖ‌లోని ప‌లు ప్ర‌భుత్వ హాస్ప‌ట‌ల్స్ వ‌ద్ద సీనియ‌ర్ సిటిజెన్స్ పోటెత్తారు….ఉద‌యాన్నే సీనియ‌ర్ సిటిజెన్స్ హాస్ప‌ట‌ల్స్ చేరుకుని క్యూలో నిలుచున్నారు.. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ వ్యాక్సిన్ వేసే దానిపై అధికారులు పెద‌వి విప్ప‌డం లేదు..దీంతో విశాఖ చెస్ట్ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత ప‌రిస్థితులు చోటు చేసుకున్నాయి. వ్యాక్సిన్ గురించి అడిగితే చెస్ట్ హాస్పిటల్ సిబ్బంది దురుసుగా ప్ర‌వ‌ర్తించారు.. దీంతో అక్క‌డి సిబ్బందికి, సీనియ‌ర్ సిటిజెన్స్ కు మ‌ధ్య తీవ్ర వాగ్వాదం జ‌రిగింది.. ఇదే ప‌రిస్థితి న‌గ‌రంలోని అన్ని ప్ర‌భుత్వ హాస్ప‌ట‌ల్స్ లోనూ క‌నిపించింది.. ముందు చూపు లేకుండా ఇచ్చిన ప్ర‌క‌ట‌న‌తో హాస్ప‌ట‌ల్స్ కు చేరుకున్న ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement