Monday, May 6, 2024

వ్యక్తిపై కత్తులతో దాడి

వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడికి పాల్పడిన ఘ‌ట‌న అనకాపల్లిలోని ఎస్.రాయవరం మండలంలో చోటుచేసుకుంది. అడ్డురోడ్డు పెద్ద గుమ్ములూరు మద్యం దుకాణం వద్ద దాడి చేసిన‌ట్లు తెలుస్తోంది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్నారు. గాయపడిన వ్యక్తి కొరుప్రోలు గ్రామానికి చెందిన డి.ప్రవీణ్ గా పోలీసులు గుర్తించారు. తీవ్ర గాయాల‌వ్వ‌డంతో 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన దుండగులు వెంటనే అక్కడ నుంచి పరారయ్యారు. నక్కపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నారాయణ రావు, ఎస్.ఐ ప్రసాదరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రవీణ్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కి తరలించారు. ఎస్.రాయవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement