Tuesday, April 30, 2024

AP | కర్నూలు రేంజ్ డీఐజీగా విజయరావు.. సెంథిల్ ఆక్టోపస్‌కు బదిలీ!

కర్నూలు బ్యూరో, (ప్రభ న్యూస్): ఏపీలో పెద్ద ఎత్తున‌ ఐపీఎస్‌ల బ‌దిలీ జ‌రిగింది. ఈ మేర‌కు చీఫ్ సెక్రటరీ సోమవారం రాత్రి ఉత్తర్వు లు జారీ చేశారు. బదిలీల్లో భాగంగా కర్నూల్ రేంజ్ డీఐజీ సెంథిల్ కుమార్ ఆక్టోపస్‌కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కర్నూల్ రేంజ్ డీఐజీగా విజయరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుతం కర్నూల్ రేంజ్‌లో పనిచేస్తున్న సెంథిల్ కుమార్ దాదాపు రెండేళ్లకు పైగా పనిచేశారు. ఇక క‌ర్నూలు రేంజ్ డీఐజీగా నియమితులైన విజయరావు గతంలో నెల్లూరు, గుంటూరు ఎస్పీగా పని చేశారు. కాగా, కర్నూలు జిల్లా సెబ్ అడిసినల్ ఎస్పీ జె.కృష్ణ కాంత్ పాటిల్ కాకినాడకు బదిలీ అయ్యారు. ఆయనను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement