Thursday, May 9, 2024

వంటనూనె కేంద్రాలపై విజిలెన్స్ దాడులు.. విష‌యం తెలిసి ప‌రారైన దుకాణ‌దారులు

క‌ర్నూల్‌: ఆదోనీలోని ఆయిల్ మిల్లులు, షాపుల‌పై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. ఆదోని ఐ కె ఆయిల్ కంపెనీ లో విజిలెన్స్ అధికారులు ఇన్స్పెక్టర్లు నాగరాజు యాదవ్, వెంకట నారాయణ, విజిలెన్స్ ప్రత్యేక తహసీల్దార్ శివరంజినిలతో కూడిన ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ప్రత్యేక బృందం దాడులు నిర్వహించి సోదాలు చేశారు. ఇక్కడ వంట నూనె ప్యాకింగ్, ఇతర కోణాలలో పరిశీలించారు. ఆదోని ఆయిల్ కంపెనీలో అధికారులు దాడులు నిర్వహిస్తున్నారనే సమాచారం రాగానే బ్లాక్ లో వంటనూనె, ఇతర వ్యాపారస్తులు తమ తమ దుకాణాలు బంద్ చేసి పరారయ్యారు.. ఎవ్వరు ఎక్కడికి పరారైన అనవసరంగా నిత్యావసర సరుకుల, వంటనూనె అధిక ధరలకు అమ్మితే, తమకు సమాచారం అందితే మాత్రం ఎవ్వరిని వదిలేదే లేదని విజిలెన్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు యాదవ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement