Sunday, May 5, 2024

Video Conference – శరవేగంగా మచిలీపట్నం పోర్టు పనులు – జిల్లా కలెక్టర్ రాజాబాబు

మచిలీపట్నం, జులై 29( ప్రభ న్యూస్): మచిలీపట్నం పోర్టు అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, వివిధ పనులకు నిర్దేశించిన టైం లిమిట్ లో పనులు పురోగతిలో ఉన్నాయని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి తమ క్యాంపు కార్యాలయం నుండి శనివారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్రంలో పోర్టు అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు.

జిల్లా కలెక్టర్ తమ బంగ్లా నుండి పోర్టు, రెవిన్యూ అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని మచిలీపట్నం పోర్టు అభివృద్ధి పనుల పురోగతి సిఎస్ కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ రైల్ రోడ్ కనెక్టివిటీ సంబంధించి మూడు దశల్లో చేపట్టే రహదారి అభివృద్ధి పనులకు సంబంధించి మొదటి దశలో బీచ్ రోడ్డు నుండి బ్రేక్ వాటర్ వరకు మెటీరియల్ తరలించుటకు తాత్కాలిక రహదారి పనులు పూర్తయ్యాయని, ఈ రహదారి శాశ్వత అభివృద్ధి పనులు వెంటనే మొదలు పెట్టాలని, రెండవ, మూడవ దశల్లో రహదారి అభివృద్ధి పనులకు సంబంధించి భూ సేకరణ పనులు వేగవంతం గావించాలని అధికారులను ఆదేశించారు. సౌత్ బ్రేక్ వాటర్ పనులు 280 మీటర్ల వరకు పూర్తికాగా, నార్త్ బ్రేక్ వాటర్ పనులు వేగవంతం గావించాలన్నారు. టర్నింగ్ సర్కిల్ ఏరియా వద్ద ల్యాండ్ సైడ్ డ్రెడ్ జింగ్ పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు.
డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు, ఆర్డిఓ ఐ కిషోర్, మచిలీపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈడీ విద్యాశంకర్, ఏ .ఈ. కే మహేష్, కలెక్టరేట్ సూపర్నెంట్ రాధిక, తాసిల్దారు శ్రీవిద్య వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement