Monday, May 6, 2024

చంద్రబాబు పరామర్శకు వచ్చారా..? దాడికి వచ్చారా..?

టీడీపీ నేత బోండా ఉమపై రాష్ట్ర మహిళ కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. బోండాలాంటి ఆకు రౌడీల పట్ల మహిళా కమిషన్ సుప్రీమే అని ఆమె వ్యాఖ్యానించారు. మహిళా కమిషన్ కన్నీరు పెట్టుకోవడానికి లేదు..కన్నీరు తుడవడానికి ఉందన్నారు. బోండాలాంటి వారికి కన్నీరు పెట్టించడానికి ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో మహిళా కమిషన్ తూతూ మంత్రంగా ఉందని విమర్శించారు. చంద్రబాబు కనీస మానత్వం మర్చిపోయారని, ఆయన పరామర్శకు రాలేదన్నారు. ఆ అరుపులు ఏంటీ..? ఆ కేకలు ఏంటీ..? అని మండిపడ్డారు. బాధితురాలికి ధైర్యం ఇవ్వకపోతే మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేనేం చేయాలి..? అనిప్రశ్నించారు. బాబు అండ్ బ్యాచ్‌ చేసిన పనికి సమన్లు ఇవ్వకపోతే..చప్పట్లు కొడతారా..? అని అడిగారు. చంద్రబాబు, బోండా ఉమా సమన్లు తీసుకుని మహిళా కమిషన్‌కు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు మానవత్వం లేని రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పరామర్శకు వచ్చారా..? దాడికి వచ్చారా..? అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement