Sunday, April 28, 2024

AP : విలువల ఆధారిత‌ రాజకీయాలను ప్రోత్సహించాలి : వీవీ లక్ష్మీ నారాయణ

దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని, విలువల ఆధారిత రాజకీయాలను ప్రోత్సహించాలని జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ పిలుపునిచ్చారు. అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.

విప్లవ స్వాతంత్ర్య సమరయోధులు భగత్ సింగ్, శివరామ్ రాజ్‌గురు, సుఖ్‌దేవ్ థాపర్‌లను బ్రిటిష్ ప్రభుత్వం మార్చి 23, 1931న లాహోర్ జైలులో ఉరితీసిందని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఈ గొప్ప వీరులకు నివాళులు అర్పిద్దామని, వారి నుంచి స్ఫూర్తిని పొందుదామని లక్ష్మీ నారాయణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ‘అందుకోండి వీరులారా.. జోహరులు’ అనే క్యాప్షన్‌తో ఒక ఫొటోని షేర్ చేశారు. ఈ ఫొటోపై భగత్ సింగ్, శివరామ్ రాజ్‌గురు, సుఖ్‌దేవ్ థాపర్‌ల ఫొటోలు ముద్రించి ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement