Wednesday, May 1, 2024

సీమలో అకాల వర్షం.. పొద్దుతిరుగుడు పంటకు అపార నష్టం

ఏపీలోని రాయలసీమలో కురుసున్న అకాల వర్షాలతో పంటలకు తీవ్రంగా నష్టం మిగిల్చింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల తాడిపత్రి మండలవ్యాప్తంగా రైతులు సాగు చేసిన  పొద్దుతిరుగుడు పంటకు అపార నష్టం వాటిల్లింది. పంట పూర్తిగా దెబ్బతింది. దాదాపు పదివేల ఎకరాల్లో ఈ పంట దెబ్బ తినిందని అంచనా. తాడిపత్రి మండల పరిధిలోని వెంకటరెడ్డిపల్లి, ఆవుల తిప్పాయపల్లి, సజ్జలదిన్నె, కావేటి సముద్రం, బ్రాహ్మణపల్లి తదితర గ్రామాల్లో దాదాపు పదివేల ఎకరాల్లో రైతులు పొద్దుతిరుగుడు పంటను సాగుచేశారు. ప్రస్తుతం ఈ పంట పూత దశలో ఉంది. అయితే, అకాల వర్షంతో పూత దశలో ఉన్న పొద్దుతిరుగుడుకు విపరీతమైన తేమ తగలడంతో విత్తనాలు మొలిచేందుకు ఆస్కారం లేకుండా పోతోందని రైతులు వాపోతున్నారు. విత్తన కొనుగోలు మొదలు ఎరువు, పురుగుల మందుల వరకు ఎకరాకు రూ.10 వేల దాకా పెట్టుబడి పెట్టామని రైతులు ఆదేవన వ్యక్తం చేస్తున్నారు.

భారీ వర్షానికి రైతులు సాగు చేసిన పొద్దుతిరుగుడు అపార నష్టం వాటిల్లిందని తెలిసి ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం తాడిపత్రి మండల కార్యదర్శి రాజా రామి రెడ్డి తెలిపారు. అవులతిప్పాయపల్లి గ్రామంలో పర్యటించి రైతులు సాగు చేసిన పొద్దు తిరుగుడు పంటను పరిశీలించారు. అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు 25 వేల రూపాయలు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement