Tuesday, May 7, 2024

కర్నూలులో పట్టుబడిన భారీ నగదు

కర్నూలు జిల్లా పంచలింగాల చెక్ పోస్టు వద్ద ఆదివారం సెబ్ పోలీసుల తనిఖీలో భాగంగా భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. బీదర్‌కు చెందిన గురునాథ్ అనే వ్యక్తి  హైదరాబాద్ నుంచి కారులో కర్నూలు వైపు వస్తుండగా సెబ్ సిబ్బంది కారును ఆపి తనిఖీ చేశారు. ఈ క్రమంలో రూ.75లక్షల నగదు కనిపించింది. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధార పత్రాలు లేకపోవడంతో సెబ్‌ అధికారులు సీజ్‌ చేశారు. కేసు నమోదు చేసి అనంతరం తాలూకా పోలీస్ స్టేషన్‌లో నగదు అప్పగించినట్లు సెబ్ సీఐ మంజుల తెలిపారు.

ఇది కూడా చదవండి: షర్మిలను కలిసిన టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి

Advertisement

తాజా వార్తలు

Advertisement