Saturday, April 20, 2024

షర్మిలను కలిసిన టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి

తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. అయితే, ఆమె పాదయాత్రలో వైసీపీ నాయకులు దర్శనం ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. ఆదివారం పాదయాత్ర సందర్భంగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి షర్మిలను కలిసారు. నాగారం గ్రామంలో షర్మిల బస చేసిన సమయంలో సుబ్బారెడ్డి, వైఎస్ షర్మిలను కలిసారు. సుమారు గంటపాటు మాట్లాడుకున్నారు. పాదయాత్రకు సుబ్బారెడ్డి సంఘీభావం తెలిపారు. తాజా రాజకీయ పరిణామాలతో ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.

తెలంగాణలో రాజన్న రాజమే లక్ష్యమంటూ పార్టీ పెట్టిన షర్మిల.. టీఆర్‌ఎస్‌ పాలనకు వ్యతిరేకంగా గత ఐదు రోజులుగా పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్‌ షర్మిలను వైవీ సుబ్బారెడ్డి కలవడంపై తెలంగాణ రాజకీయాలు మరో మలుపు తిరిగాయి.

ఇది కూడా చదవండి: IND VS PAK: జోరుగా ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్

Advertisement

తాజా వార్తలు

Advertisement