Sunday, April 28, 2024

ఉక్రెయిన్ టు ఏపీ వయా ఢిల్లీ.. విద్యార్థులని స్వస్థలాలకు చేర్చేలా ఏపీ భవన్ ఏర్పాట్లు..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఎన్నో ఆశలతో చదువుకోవడానికి దేశం కాని దేశం వెళ్లిన తెలుగు విద్యార్థులు యుద్ధం బారి నుంచి తప్పించుకుని బతుకు జీవుడా అనుకుంటూ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఉక్రెయిన్ నుంచి విడతల వారీగా స్వదేశానికి తిరిగి వస్తున్నారు. బుధవారం ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ వచ్చిన 28 మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ భవన్‌కు చేరుకున్నారు. ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వసతి, భోజన, రవాణా, ఇతర ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు సురక్షితంగా ఇళ్లకు చేరుకునే వరకు సహాయ సహకారాలు అందజేస్తామని పీఆర్సీ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement