Thursday, May 2, 2024

KNL: కేసీ కెనాల్ లో ఇద్దరు విద్యార్థులు గల్లంతు

కర్నూలు : కర్నూలు నగరంలోని వినాయక ఘాట్ వద్ద కేసీ కెనాల్ లో ఇవాళ ఇద్దరు విద్యార్థులు నీటిలో గల్లంతయ్యారు. విద్యార్థుల ఆచూకీ కోసం పోలీసులు ఘాట్ కు ఇరువైపులా గాలింపు చర్యలు చేపట్టారు. మూడో పట్టణ సీఐ మురళీధర్ రెడ్డి నేతృత్వంలో గాలింపు నిర్వహిస్తున్నారు. కలెక్టరేట్ వెనుక ఉన్న బుధవార పేట గాంధీ మెమోరియల్ పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థులు ఎం.సాయి చరణ్, పవన్ కుమార్ లుగా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement