Sunday, April 28, 2024

ఒకే ఇంట్లో ఇద్దరు అదృశ్యం.. పోలీసులకు అందిన ఫిర్యాదు

పాయకాపురం, (ప్రభా న్యూస్) : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కృష్ణా జిల్లాలో ఒకే ఇంటికి చెందిన కూతురు, కొడుకు (ఇద్దరు) అదృశ్య‌మ‌య్యారు. ఈ ఘ‌ట‌న‌పై నున్న పోలీస్ స్టేషన్లో ఇవ్వాల (మంగళవారం) కేసు నమోదు అయ్యింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. నున్న ప్రాంతానికి చెందిన అడసాడ స్రవంతి, దుర్గా ప్రసాద్‌ల‌కు ముగ్గురు సంతానం.

పెద్ద కుమార్తె రామ లక్ష్మి( 17) పదో తరగతి చదువుతున్నది. మణికంఠ (10) నాలుగో తరగతి చదువుతున్నాడు. రామలక్ష్మి, మణికంఠ వేరొక ఇద్దరు వ్యక్తులతో కలిసి వెళ్లినట్లు, అక్కడ ఉండే ఐస్ క్రీమ్ షాపులో ఉండే సీసీ కెమెరా ద్వారా చూచి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement