Thursday, May 2, 2024

ఆర్ఎంపీ వైద్యం వికటించి.. ఇద్ద‌రు మృతి..

ఆర్ఎంపీ డాక్ట‌ర్ చేసిన వైద్యం విక‌టించి ఇద్ద‌రు మృతిచెందగా, మ‌రికొంత మంది ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా ఓబులదేవల చెరువులో నెలకొంది. ఆర్ఎంపీ డాక్టర్ చేసిన వైద్యం వికటించి ఇద్దరు మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఈ ఘటన ఓడీసీ మండలం కుంట్లపల్లిలో చోటు చేసుకుంది.

మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న సుమారు 40మంది ఆర్ఎంపీ వైద్యుడిని సంప్రదించారు. వీరందరికీ ఇంజక్షన్ ఇవ్వగా రెండు రోజులకు నడవలేని స్థితికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వైద్యం వికటించి రాత్రి ఇద్దరు మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘ‌ట‌న‌లో చ‌నిపోయిన వారు పొప్పూరప్ప, రామప్పలుగా గుర్తించారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాద చాయ‌లు అలుముకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement