Thursday, May 9, 2024

Breaking: అనంత‌పురం జిల్లాలో యాక్సిడెంట్‌.. రెండు బైకులు ఢీకొని ఇద్ద‌రు మృతి

అనంత‌పురం జిల్లాలో ఘోరం జ‌రిగింది. రెండు బైకులు ఢీకొన్న ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు చ‌నిపోయారు. వజ్రకరూరు, గుంతకల్లు మండలాల‌ శివారులో ఈ యాక్సిడెంట్ జ‌రిగింది. కొనకొండ్ల గ్రామం వద్ద ఉరవకొండ రహదారిపై రెండు బైకులు ఢీ కొన్నాయి. దీంతో అక్కడికక్కడే ఇద్దరు చ‌నిపోయారు. మ‌రో ఇద్ద‌రికి తీవ్ర గాయాల‌య్యాయి. దీంతో వారిని ద‌గ్గ‌ర్లోని ఆస్పత్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులకు స్థానికులు ఈ బైక్ యాక్సిడెంట్‌పై స‌మాచారం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement