Tuesday, April 30, 2024

AP: నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి..

సంక్రాంతి సెలవులు ఆ కుటుంబంలో విషాదాన్ని నింపాయి. సెలవుల కారణంగా ఆడుకునేందుకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు నీటి కుంటలో పడి మృతిచెందిన ఘటన ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం పాత గోళ్లవిడిపి గ్రామంలో చోటుచేసుకుంది.

ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి నార్నపాటి శివాంజి (8), నార్నపాటి సాయి (10) అనే చిన్నారులు మృతిచెందారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో నీటి గుంట దగ్గరకు వెళ్లి ఆడుకునే సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని సమాచారం. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మృతదేహాలను చూసి భోరున విలపించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement