Monday, April 29, 2024

AP: రెండు బస్సులు ఢీ.. 15 మందికి తీవ్రగాయాలు

రెండు బ‌స్సులు ఢీకొని 15మందికి తీవ్ర‌గాయాలైన ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వినుకొండ నుంచి విజయవాడకు ప్రయాణికులతో బ‌య‌ల్దేరిన‌ ఆర్టీసీ బస్సు.. బెంగళూరు వెళ్తున్న ప్రైవేటు బస్సు పెట్లూరిపాలెం వద్ద అదుపుతప్పి ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో గాయపడిన ప్రయాణికులను సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవ‌ర్ పరారయ్యాడు. ప్రమాదానికి గురైన బస్సులను తొలగించిన పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement