Friday, May 3, 2024

CM Stalin :ధైర్యంగా ఉండండి.. నేనున్నా…తుపాన్ బాధితుల‌తో సీఎం స్టాలిన్

ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులను స్వయంగా కలిసి వారి కష్టాలు తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.వారికి నీరు, ఆహారం వంటివి అందించారు. తుఫాను బాధిత ప్రజలకు ఆయన సహాయ సామగ్రిని కూడా పంపిణీ చేశారు.

స్టాలిన్ ప్రజలతో మమేకమవుతు వారికి ధైర్యాన్ని కల్పిస్తున్నారు. బాధితులు ఆశ్రయం పొందుతున్న శిబిరాలకు వచ్చి వారితో స్వయంగా మాట్లాడి వారికి ఆహారాన్ని అందిస్తున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం కల్పిస్తున్నారు. సీఎం స్వయంగా వచ్చి తమ పరిస్థితిని తెలుసుకుంటుండటంతో బాధితులంతా సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement