Friday, May 17, 2024

Tirumala: సర్వదర్శనం టోకెన్లు నిలిపివేయనున్న టీటీడీ

శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. టీటీడీ సర్వదర్శనం టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేయనుంది. ఈ రోజు ఈ నెల 12వ తేదికి సంబంధించిన దర్శనానికి టోకెన్లను జారీ చేయనుంది. మంగళవారం(ఏప్రిల్ 12) నాటి స్లాట్ పూర్తి కాగానే టోకెన్ల జారీ నిలిపివేస్తారు. నేటి కోటా పూర్తవగానే టోకెన్ల జారీని నిలిపివేసి తిరిగి 12వ తేదీ మధ్యాహ్నం నుంచి ప్రారంభించనున్నారు. భక్తుల అధిక రద్దీ కారణంగా బుధవారం నాటి సర్వదర్శనం టోకెన్లు ఒక రోజు ముందుగానే మంగళవారం మధ్యాహ్నం నుండి తిరుపతిలోని ఆయా కౌంటర్లలో కేటాయించారు. కాగా, ఆది, సోమవారాల్లో దర్శన టోకెన్లు కేటాయించబడవు. భక్తులు ఈ విషయాన్ని గమనించి తదనుగుణంగా తమ తిరుమల యాత్ర ప్రణాళిక రూపొందించుకోవాలని టీటీడీ సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement