Thursday, May 2, 2024

బెంగళూరు శ్రీవారి ఆలయంలో పుష్కరిణి, కల్యాణ కట్టను ప్రారంభించిన టీటీడీ ఛైర్మన్

తిరుపతి : బెంగళూరు నగరంలోని వయ్యాలికావల్ లో గల వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్మించిన స్వామివారి పుష్కరిణి, కల్యాణకట్టను ఆదివారం టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ రూ.7 లక్షల వ్యయంతో ఇక్కడ పుష్కరిణి నిర్మించామని, తిరుమలకు రాలేని భక్తులు ఇక్కడ తలనీలాలు సమర్పించి, స్వామివారి పుష్కరిణలో స్నానం చేసేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కరిణిని ప్రారంభించారు. అదేవిధంగా కల్యాణకట్ట, ప్రసాదాల విక్రయ కేంద్రం, టీటీడీ ఉత్పత్తుల విక్రయ కేంద్రం, టీటీడీ సేవా టికెట్ల కౌంటర్ ను ఛైర్మన్ ప్రారంభించారు. ఇక్కడి టీటీడీ కళ్యాణ మండపంలో జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ స్టూడియో పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బెంగళూరు స్థానిక సలహా మండలి అధ్యక్షులు సంపత్ రవి నారాయణన్, ఉపాధ్యక్షులు రాధాకృష్ణ అడిగ, కార్యదర్శి భక్తవత్సల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement