Monday, April 29, 2024

TTD: తిరుమలలో 5 రోజుల పాటు బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు..

తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు పోటెత్తారు. స‌ర్వ‌ద‌ర్శ‌నాల టోకెన్లు జారీ చేస్తున్న కేంద్రాల వ‌ద్ద భ‌క్తులు భారీ సంఖ్య‌లో బారులు తీరారు. ఈ క్ర‌మంలో తోపులాట జ‌రిగి, ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. దీంతో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. రేపటి(బుధవారం) నుంచి ఆదివారం వ‌ర‌కు ఐదు రోజుల పాటు వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను టీటీడీ ర‌ద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. టికెట్లు లేకున్నా శ్రీవారి ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లు కూడా పెంచాల‌ని టీటీడీ నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతం రోజుకు 30 వేల టోకెన్లు జారీ చేస్తుండ‌గా, ఆ సంఖ్య‌ను 45 వేల‌కు పెంచాల‌ని టీటీడీ నిర్ణ‌యం తీసుకున్న‌ది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని అధికారులు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement