Monday, April 29, 2024

ఏపీలో ఐఏఎస్ అధికారుల బ‌దిలీలు.. ఎవ‌రెవ‌రు ఎక్క‌డికి ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యారంటే!

ఏపీలో ప‌లువురు ఐఏఎస్ అధికారులు మంగ‌ళ‌వారం బ‌దిలీ అయ్యారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఇవ్వాల రాత్రి ఉత్త‌ర్వులు జారీ చేసింది. రాష్ట్ర ర‌వాణా శాఖ కమిష‌న‌ర్‌గా రాజ‌బాబు నియ‌మితుల‌య్యారు. అదే విధంగా ఆరోగ్య శ్రీ అద‌న‌పు సీఈవోగా హరీంద్ర ప్రసాద్ నియ‌మితుల‌య్యారు. నెల్లూరు జిల్లా జేసీగా రోణంకి కూర్మ‌నాథ్‌ను ప్ర‌భుత్వం నియ‌మించింది. ఇక మిగిలిన బ‌దిలీల విష‌యానికి వ‌స్తే.. పార్వతీపురం ఐటీడీఏ పీఓగా ఆనంద్‌, మిష‌న్ క్లీన్ కృష్ణా, గోదావ‌రి కెనాల్స్ డైరెక్ట‌ర్‌గా కాటంనేని భాస్క‌ర్‌, గిరిజ‌న సంక్షేమ శాఖ ప‌రిధిలోని జీసీసీ ఎండీగా సురేశ్ కుమార్‌, ఏపీసీఎఫ్ఎస్ఎస్ డిప్యూటీ సీఈఓగా సునీల్ కుమార్ రెడ్డి నియ‌మితుల‌య్యారు.

Nellore JC Harendira prasad

Advertisement

తాజా వార్తలు

Advertisement