Wednesday, May 1, 2024

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. ఆదేశాలు జారీ చేసిన సీఎస్ స‌మీర్‌శ‌ర్మ‌..

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీల్లో భాగంగా పోస్టింగ్‌ కోసం వేచి చూస్తున్న సౌరబ్‌ గౌరౌలు ఐటీఈ శాఖ కార్యదర్శిగా నియమించారు.

ఇప్పటి వరకు ఈ శాఖను నిర్వహిస్తున్న జి. జయలక్ష్మీని బీసీ సంక్షేమశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శిగా బదిలీ చేశారు. ఆర్థికశాఖలో అదనపు కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న ఎ. గుల్జార్‌ను బాధ్యతల నుంచి తప్పించారు. బీసీ సంక్షేమ శాఖ స్పెషల్‌ సీఎస్‌గా పనిచేస్తున్న జి. అనంతరామును బదిలీ చేశారు. ఆయనను కార్మిక శాఖ స్పెషల్‌ సీఎస్‌గా నియమించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement