Monday, April 29, 2024

వీఆర్ లో ఉన్న 25 మంది పోలీసు సిబ్బంది బదిలీ

గుంటూరు క్రైమ్, (ప్రభ న్యూస్) : వీఆర్ లో ఉన్న 25 మంది పోలీసు సిబ్బంది బదిలీ అయ్యారు. వీఆర్ లో ఉన్న పోలీసులను పోలీస్ స్టేషన్లకు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని బదిలీ చేశారు. సోమవారం గుంటూరు రూరల్ జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహించిన సమావేశంలో వీఆర్ లో ఉన్న పోలీసులతో మాట్లాడిన రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ.. వీఆర్ కి రావడానికి గల కారణాలను తెలుసుకుని, ఇక నుండి సత్ప్రవర్తన కలిగి విధులు నిర్వర్తించాలని తెలిపారు. వీఆర్ లో ఉన్న మొత్తం 25మంది.. ఇద్ద‌రు ఏఎస్ఐ, న‌లుగురు హెడ్ కానిస్టేబుళ్లు, 9 మంది కానిస్టేబుళ్లకు వారు కోరుకున్న విధంగా, పోలీస్ స్టేషన్లలో ఉన్న ఖాళీల ఆధారంగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement