Tuesday, March 26, 2024

అమెజాన్‌ ప్రైమ్‌ యూజర్లకు న్యూఇయర్‌ బంపర్‌ గిఫ్ట్‌..!

అమెజాన్‌ ప్రైమ్‌ యూజర్లకు అమెజాన్‌ గుడ్‌న్యూస్‌ను. వచ్చే ఏడాది నుంచి క్రికెట్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌ను సేవలను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో పొందవచ్చునని అమెజాన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య జరిగే టెస్ట్ సిరీస్‌ను జనవరి 1, 2022 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో లైవ్‌ స్ట్రీమ్‌ కానుంది. నవంబర్ 2020లో, అమెజాన్‌ ప్రైమ్ వీడియో న్యూజిలాండ్‌ క్రికెట్ బోర్డు నుంచి లైవ్‌ స్ట్రీమింగ్‌ హక్కులను పొందింది. ఈ ఒప్పందంలో భాగంగా… న్యూజిలాండ్‌ ఆడే అంతర్జాతీయ పురుషుల, మహిళల క్రికెట్ మ్యాచ్‌లను ప్రైమ్‌ వీడియోలో అందుబాటులో ఉండనున్నాయి.

ఇండియా మ్యాచ్‌లు కూడా..
స్టార్‌స్పోర్ట్స్, హాట్‌స్టార్‌ భారత క్రికెట్‌ మ్యాచ్‌లను లైవ్‌ స్ట్రీమింగ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. క్రికెట్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌ విభాగంలోకి అమెజాన్ వచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఇండియా-న్యూజిలాండ్‌ మహిళల జట్ల మధ్య జరిగే సిరీస్‌ను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో లైవ్‌ స్ట్రీమింగ్‌ కానుంది. భారత మహిళల క్రికెట్‌ మ్యాచ్‌లతో పాటు నవంబర్‌ 2022లో భారత, న్యూజిలాండ్‌ పురుషుల జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లు కూడా స్ట్రీమ్‌ అవ్వనున్నాయి. వీటితో పాటుగా న్యూజిలాండ్‌ మెన్స్‌ జట్టు 2022 ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా పర్యటన, మార్చి 2022లో ఆస్ట్రేలియా పర్యటన, మార్చి/ఏప్రిల్ 2022లో నెదర్లాండ్ పర్యటనలను కూడా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో లైవ్‌ స్ట్రీమ్‌ కానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement