Sunday, May 5, 2024

AP: యాటకల్లులో విషాదం.. అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య…

ఆంధ్ర ప్రభ, క్రైమ్ న్యూస్: ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శెట్టూరు మండలం యాటకల్లులో ఇవాళ చోటుచేసుకుంది. యాటకల్లుకి చెందిన జ్యోతి, రూప అక్కాచెల్లెళ్లు వారి ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారన్నారు. గ్రామంలో అందరితో కలిసి మెలిసి ఉన్న అక్కాచెల్లెళ్ళు ఒక్కసారిగా ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో విషాదం నెలకొంది.

స్థానికులు తెలిపిన వివరాల మేరకు… యాటకల్లు గ్రామానికి చెందిన చాకలి నారాయణస్వామికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య మృతిచెందడంతో రెండవ భార్య సరస్వతిని 22సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. మొదటి భార్యకు కుమారుడు మనోజ్, రెండవ భార్య సరస్వతికి ఇద్దరు కుమార్తెలున్నారు. చాకలి రూప (18) చాకలి జ్యోతి (20)లు అనంతపురంలో ఒక కళాశాలలో డిగ్రీ చదువుతున్నారు.

కొద్దిరోజుల క్రితం గ్రామానికి వచ్చిన అక్కాచెల్లెళ్లు రూప, జ్యోతిలు గ్రామంలోని స్వగృహంలోనే ఉండేవారు. బయటికి వెళ్లేవారు కాదు. ఇవాళ మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇద్దరు అమ్మాయిలు మృతిచెందడంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement