Monday, April 29, 2024

Exclusive | విశాఖలో విషాదం.. వేర్వేరు ఘటనల్లో కుటుంబంతో సహా అయిదుగురు ఆత్మహత్య!

విశాఖలో మూడు విశాదకర ఘటనలు జరిగాయి. డాక్టర్​ వేధింపులతో భార్య ఆత్మహత్య చేసుకోగా, పెందుర్తిలో ఆర్థిక ఇబ్బందుతలో ఓ కుటుంబం సూసైడ్​ చేసుకుంది. మరో మెడికో స్టూడెంట్​ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మూడు ఘటనలు ఇవ్వాల (శుక్రవారం) జరిగాయి. ఈ మూడు వేర్వేరు ఘటనలతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

– వెబ్​ డెస్క్​, ఆంధ్రప్రభ

అదనపు కట్నం కోసం డాక్డర్​ తన భార్యను వేధించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో డాక్టర్​ సాయి సుధీర్​ను పోలీసులు విచారణ చేస్తన్నారు. చెడు వ్యసనాలకు బానిసైన డాక్టర్​ మద్యం, జూదం అలవాట్లతో రూ.70 లక్షల వరకు అప్పులు చేసినట్టు తెలుస్తోంది. కాగా, అతడి ప్రవర్తన బాగా లేకపోవడంతో ప్రభుత్వం ఈ మధ్యనే జాబ్​ నుంచి తొలగించినట్టు సమాచారం అందుతోంది.. అటు ఉద్యోగం పోవడం, ఇటు ఖర్చులు పెరగడం.. అప్పుల వారి ఇబ్బందులు తట్టుకోలేక తన భార్యను అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేసినట్టు తెలుస్తోంది..

 ఇక.. విశాఖలోని డాబా గార్డెన్స్​లో ఓ మెడికో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కేరళకు చెందిన కృష్ణ అనే యువతి లాడ్జిలో ఉరేసుకుని చనిపోయింది. ఈ యువతి చైనాలో ఎంబీబీఎస్​ చదువుతున్నట్టు తెలుస్తోంది. కాగా, పోలీసులు ఆ యువతి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇక.. పెందుర్తి మండలం గోరపల్లిలో విషాదం నెలకొంది. పురుగుల మందు తాగి ఓ కుటుంబ ఆత్మహత్య యత్నం చేసింది. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దంపతులు ఇద్దరూ మృతిచెందారు. కూతురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. చికిత్స కొనసాగిస్తున్నారు. దీనికి ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement