Wednesday, May 15, 2024

Welfare Government – అన్ని వర్గాల అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ ల‌క్ష్యం – ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్

మోపాల్ మండల్ ఆగస్టు 25 ప్రభాన్యూస్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మొపాల్ మండలం ముదక్ పల్లి గ్రామానికి చెందిన ఎస్సీ కమ్యూనిటీ భవనానికి ₹ 7.50 లక్షలు ప్రోసిడింగ్ ఆర్డర్స్ పత్రాలను పంపిణీ చేశారు. ఎస్సీ కమ్యూనిటీ సోదరులు తమ సొంత స్థలంలో భవన నిర్మాణం చేసుకుంటామని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ ని కలిసి కోరగా ఈ మేరకు ఆయన నిధులనుండి కేటాయి స్తూ శుక్రవారం ప్రొసీడింగ్‌ ఆర్డర్స్ పత్రాలను సంబంధిత ఎస్సీ కమ్యూనిటీ కుల సంఘ సభ్యులకు పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా ఎస్సీ కమ్యూ నిటీ కుల సంఘ సభ్యులు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కి, జిల్లా యువ నాయకులు జిల్లా ఒలంపిక్ ఉపాధ్యక్షులు ధర్పల్లి జెడ్పిటిసిబాజిరెడ్డి జగన్మోహన్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. నిజామాబాద్ రూరల్ నియో జకవర్గంలో ఇప్పటివరకు 47 కోట్లు SDF మరియు CDP నిధులతో చాలావరకు కమ్యూనిటీ హాల్స్ నిర్మించుకోవడం జరిగింద‌ద‌ని, మ‌రికొన్ని ప‌నులు ఇంకా జరుగుతున్నాయ‌న్నారు, ప్రతి గ్రామంలో ఇప్పటివరకు 25 కోట్ల రూపాయలతో ఎనర్జీ ఎస్ ద్వారా ప్రతి గ్రామ గ్రామాన సిసి రోడ్స్ డ్రైనేజీలు నిర్మాణం పనులు పూర్తి చేశామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement