Saturday, April 27, 2024

Tragedy Deaths – కలిగిరిలో విషాదం … విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి

కలిగిరి జూన్ 29 ( ప్రభ న్యూస్) కలిగిరి మండలంలోని కుమ్మర కొండూరు పొలాల్లో 11 కెవి వైరు తగలడంతో ఇద్దరు మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు మృతుడు కంచం రెడ్డి మల్లికార్జున్రెడ్డి గోరుచిక్కుడు పేరు వేసి ఉన్నాడు. గత రెండు రోజుల క్రితం గాలి వేయడంతో తోటలోకి విద్యుత్ సరఫరా అయ్యే వైరు తెగిపోయింది. ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ వేల్పుల నారాయణ సహాయంతో విద్యుత్ లైను పునర్ధరించడానికి ప్రయత్నం చేసే సమయంలో ఎల్ టి లైన్ పైన ఉన్న 11 కెవి లైన్ ను గమనించకపోవడంతో పై ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మల్లిఖార్జున రెడ్డి, నారాయణలు పూర్తిగా కాలిపోయారు..

ట్రాన్స్కో అధికారులకు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే పై సంఘటన జరిగిందని గ్రామస్తులు తెలుపుతున్నారు రైతు మల్లికార్జున్రెడ్డి (43) ముగ్గురు పిల్లలు ఎలక్ట్రిషన్ నారాయణ 40 ఇద్దరు కుమారులు భార్య ఉన్నారు. .

Advertisement

తాజా వార్తలు

Advertisement