Monday, April 29, 2024

Breaking: టూరిస్ట్ బస్సు బోల్తా.. పలువురికి గాయాలు

టూరిస్ట్ బ‌స్సు బోల్తాప‌డ‌డంలో ప‌లువురికి గాయాలైన ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అల్లూరి జిల్లా పాడేరులో చోటుచేసుకుంది. పర్యాటక ప్రాంతమైన వంజంగి ఘాటు వద్ద బస్ బోల్తా పడింది. వంజంగి హిల్స్ ఎత్తుగా ఉండటంతో మినీ బస్ ముందుకు వెళ్లలేక వెనక్కి వస్తూ అదుపుతప్పి లోయలో పడింది.

ఈ ప్రమాదంలో కొందరికి తీవ్రగాయాలు కాగా.. మరికొందరు స్వల్ప గాయాలతో బయటపడినట్లు సమాచారం. క్ష‌త‌గాత్రుల‌ను గుర్తించిన స్థానికులు పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రాణాపాయం నుండి త‌ప్పించుకున్నామ‌ని టూరిస్టులు అంటున్నారు. అయితే ఈ ప్ర‌మాదానికి సంబంధించిన పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement