Sunday, April 28, 2024

అసెంబ్లీ సమావేశాలకు పటిష్టమైన బందోబస్తు : రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ

గురువారం వెలగపూడిలోని సచివాలయంలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశం దృష్ట్యా సచివాలయ పరిసర ప్రాంతాల్లో పటిష్టమైన బందోబ‌స్తును ఏర్పాటు చేశామని రాష్ట్ర అదనపు డీజీపీ డా.రవి శంకర్ అయ్యంనార్ కి గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. అసెంబ్లీ సమావేశంనకు ముఖ్యమంత్రి ,వివిధ శాఖ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ ప్రభుత్వ శాఖల అధిపతులు, ఇతర ప్రముఖ వ్యక్తులు హాజరవుతున్న సందర్భంగా అసెంబ్లీ, మండలి సమావేశ ప్రాంగణాలు, సచివాలయ పరిసర ప్రాంతాల్లో చేసిన భద్రత ఏర్పాట్లను పరిశీలించడానికి అదనపు డిజీపీ (లా అండ్ ఆర్డర్) ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా రూరల్ జిల్లా పోలీస్ శాఖ తరపున పటిష్ఠమైన భద్రత చర్యలు తీసుకున్నామని రూరల్ ఎస్పీ వివరించారు. అనంతరం రూరల్ ఎస్పీ అసెంబ్లీ ప్రాంగణం సచివాలయ పరిసర ప్రాంతాల్లో కలియతిరిగి ఏర్పాటు చేసిన బందోబస్తును పరిశీలించి, బందోబస్తు విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులతో మాట్లాడి అసెంబ్లీ సమావేశం ముగిసే వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ, విధులు నిర్వహించాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement