Tuesday, April 30, 2024

Corona Count – కొత్త‌గా 636 పాజిటివ్స్ – త్రి డెత్స్ …

భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, నిన్నటితో పోలిస్తే నేడు కొత్త కేసుల్లో కాస్త తగ్గుదల కనిపిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో 636 కొత్త కేసులు వెలుగు చూశాయి.తాజా కేసులతో కలిపి దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 4,394కు చేరుకుంది. ఇక నిన్న‌ ఒక్కరోజే మహమ్మారి కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,33,364కి ఎగబాకింది. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ కరోనా నుంచి 4,44,76,150 మంది కోలుకున్నారు. .

Advertisement

తాజా వార్తలు

Advertisement