Sunday, April 28, 2024

AP: ఆనాటి ఆలోచనతోనే ఈరోజు విశ్వనగరంగా హైదరాబాద్… నారా లోకేష్​

అభివృద్ధిని అడ్డుకున్న.. సీఎం జగన్​
రాళ్లు రప్పలతో నిండిన మాదాపూర్‌ ను అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుది
ట్రాన్స్ పోర్టు కాంట్రాక్ట్ కోసం బెదిరింపులు
పోలవరాన్ని నాశనం చేశారు
ఏపీ అభివృద్ధి ధ్వంసం.. పరిశ్రమలన్నీ పరార్..
ప్రజలపై విద్యుత్ భారం
ఏపీపీఎస్సీని భ్రష్టు పట్టించారు
అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ
మంగళగిరి ఎన్నికల ప్రచారంలోనారా లోకేష్

- Advertisement -

(ఆంధ్రప్రభ, అమరావతి) : సైబరాబాద్ అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుది అని, దేశచరిత్రలో గత ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధిని అడ్డుకున్న ఏకైక సీఎం జగన్ మాత్రమేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కొలనుకొండ ఆర్ఆర్ రచన అపార్ట్ మెంట్ నివాసితులతో ఆయన భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… రాళ్లు రప్పలతో కూడిన మాదాపూర్ ను టీడీపీ అధినేత చంద్రబాబు అభివృద్ధి చేశారని, సైబరాబాద్, ఆర్థిక లక్ష్యంతో పలు పరిశ్రమలు ఆ ప్రాంతానికి వచ్చాయన్నారు. ఈరోజు అక్కడ ఎకరా వందకోట్లు పలుకుతోంది. చంద్రబాబు నాటిన మొక్కను తర్వాత ప్రభుత్వాలు కొనసాగించడం వల్లే హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందింది అని లోకేష్ వివరించారు.

ఏపీ ధ్వసమైంది
ఆంధ్రప్రదేశ్ లో జగన్ గత ప్రభుత్వం రాజధాని, పోలవరం పనులను నిలిపివేసింది, అనాలోచితంగా పీపీఏలను రద్దు చేశారని, ఫ్యాక్స్ కాన్, అమర్ రాజా, జాకీ వంటి పరిశ్రమలను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని లోకేష్ ఆరోపించారు. కులముద్రవేసి వేధించడంతో దేశంలోనే పేరెన్నికగన్న వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ ఒరిస్సా వెళ్లి రూ. 1200 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేసుకుందన్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ట్రాన్స్ పోర్టు, క్యాంటీన్ కాంట్రాక్ట్ కో టీసీఎల్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ను నిర్బంధించారు, చివరకు ఈ విషయం పీఎంఓకి చేరి తీవ్రంగా మందలించడంతో వెనక్కితగ్గారని లోకేష్ అన్నారు. ఇలాంటి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఉన్నచోట పరిశ్రమలు ఎలా వస్తాయి? జగన్ చేతగానితనం, అహంకారం వల్లే పరిశ్రమలన్నీ ఇతర రాష్ట్రాలకు క్యూ కడుతుయని, ఎటువంటి అభివృద్ధి చెందకుండా ప్రజలకు తాము విసిరే చిల్లరకోసం ఎదురుచూస్తూ ఉండాలన్నది ఫ్యాక్షనిస్టు నైజం అని లోకేష్ విమర్శించారు.

పోలవరాన్ని నాశనం చేశారు
గత ప్రభుత్వంలో 72శాతం పూర్తిచేసిన పోలవరాన్ని రివర్స్ పాలనతో సర్వనాశనం చేశారని, జగన్ ప్రభుత్వ అనాలోచిత చర్యలతో కాఫర్ డ్యామ్, డయాఫ్రం వాల్ దెబ్బతిన్నాయని లోకేష్ విమర్శించారు. చంద్రబాబు ముందు చూపుతో కట్టిన పట్టిసీమే ప్రస్తుతం దిక్కయిందన్నారు. అతి చౌకగా లభించే రెన్యువబుల్ ఎనర్జీ పీపీఏలను జగన్ రద్దుచేసి, యూనిట్ 10 రూపాయలకు ఓపెన్ మార్కెట్ లో కొనుగోలు చేయడంవల్లే విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడుతోందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీలు పెంచబోమని. రెన్యువల్ ఎనర్జీని ప్రోత్సహించి పద్ధతి ప్రకారం ఛార్జీలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు. ఏడాదిలోగా రాజధానికి అనుసంధానంగా ఉన్న రోడ్లనిర్మాణాలను పూర్తిచేస్తామని, గత అయిదేళ్లుగా రాష్ట్రంలో అన్నింటా డబ్బు, లాలూచీ, రాజకీయాలే, స్వతంత్రంగా పనిచేయాల్సిన ఏపీపీఎస్సీని కూడా భ్రష్టుపట్టించారని లోకేష్ ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీతో టీచర్ పోస్టులను భర్తీచేస్తామని, అయిదేళ్లలో పెండింగ్ పోస్టులన్నీ భర్తీచేస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement