Sunday, May 5, 2024

Breaking: ద్రాక్షతోటలో అనుమానాస్పదంగా ముగ్గురు మృతి.. ద‌ర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అనంత‌పుర‌ము జిల్లాలో దారుణం జ‌రిగింది. ద్రాక్షతోటలో ముగ్గురు అనుమానాస్పదస్థితిలో చ‌నిపోయి క‌నిపించారు. తొలుత ఈ ముగ్గురు యువకులు ద్రాక్షతోటలో అపస్మారక స్థితిలో ఉన్న విషయాన్ని గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వారు మరణించారు. ఈ ముగ్గురు కూడా మహారాష్ట్రకు చెందిన యువకులని స్థానికుల ద్వారా తెలుస్తోంది. అయితే.. ఈ ముగ్గురి మరణానికి గల కారణాలు మాత్రం తెలియ‌డం లేదు. అనుమానాస్పదస్థితిలో ఈ ముగ్గురు పడి ఉండడానికి గ‌ల కారణాలు పోస్టుమార్టం రిపోర్టులో తేలనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement