Wednesday, May 8, 2024

AP: జీడి తోటల్లో మూడు ఎలుగుబంట్ల సంచారం..

కొత్తూరు : సెప్టెంబర్ 9:(ప్రభ న్యూస్):శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలోని వెంకటాపురం గ్రామ పరిసరాల్లోని జీడి తోటల్లో మూడు బల్లుకాలు(ఎలుగు బంట్లు) సంచరిస్తున్నాయి. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం వెంకటాపురం గ్రామానికి చెందిన కొందరికి ఎలుగు బంట్లు కనిపించడంతో దూరం నుండి ఒక ఎలుగు బంటి ఫోటోను సెల్ ఫోన్ లో చిత్రీకరించారు.

ఒక తల్లి ఎలుగు బంటి, రెండు పిల్ల ఎలుగు బంట్లు వెంకటాపురం తోటల్లో, గ్రామ సమీపంలో సంచరిస్తుండడంతో గ్రామస్తులు బయటకు రావడానికి భయపడుతున్నారు. ఏ క్షణంలోనైనా స్థానికులు తోటల్లోకి వెళితే ఎలుగులు దాడి చేసే ప్రమాదముందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం అటవీ శాఖ అధికారులకు గ్రామస్తులు సమాచారం తెలియజేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement