Friday, April 26, 2024

తిరుప‌తిలోకి బ‌య‌టి వ్య‌క్తులు చొర‌బ‌డ్డారు: చంద్ర‌బాబు

తిరుప‌తి ఉప ఎన్నిక పోలింగ్ కొన‌సాగుతోంది. తిరుప‌తిలో పార్ల‌మెంట‌రీ నియోజ‌క వ‌ర్గంలోకి బ‌య‌టి వ్య‌క్తులు భారీగా చొర‌బ‌డ్డార‌ని టిడిపి అధినేత చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ప‌లు చోట్ల అవ‌క‌త‌వ‌క‌లు జ‌రుగుతున్నాయంటూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారికి చంద్ర‌బాబు నాయుడు లేఖ రాశారు. రెండు బ‌స్సుల్లో బ‌య‌టి వ్య‌క్తుల్ని వైసీపీ నేత‌లు తిరుప‌తిలోకి త‌ర‌లించార‌ని చంద్ర‌బాబు చెప్పారు. వైసీపీ నేత‌లు కొన్ని బూత్‌ల‌లో టీడీపీ ఏజెంట్ల‌ను అడ్డుకుంటున్నార‌ని ఆయ‌న తెలిపారు. తొట్టెంబేడు మండ‌లం కందేలుగుంట‌లో టీడీపీ నేత‌ల‌ను అడ్డుకున్నార‌ని వివ‌రించారు. స్థానికేత‌రుల‌తో తిరుప‌తి ఉప ఎన్నిక‌లో వైసీపీ నేత‌లు అవ‌క‌త‌వ‌క‌లకు పాల్ప‌డే ప్ర‌య‌త్నాలు జరుపుతున్నార‌ని ఆయ‌న అన్నారు ఇందుకు సంబంధించిన ఫొటోల ఆధారాల‌ను త‌న లేఖ‌కు చంద్ర‌బాబు నాయుడు జ‌త చేశారు. .

Advertisement

తాజా వార్తలు

Advertisement