Thursday, May 16, 2024

సినీ ఫక్కీలో చోరీ.. రూ.1.20 లక్షలు అపహరణ

నెల్లూరు జిల్లా గూడూరులో సినీ ఫక్కీలో చోరీ జరింది. వివరాల్లోకి వెళ్లితే.. దూర్జటినగర్ కు చెందిన రాజ్ కుమార్ అనే యువకుడు ఖర్చుల నిమిత్తం లక్షా ఇరవై వేలు బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి డ్రా చేశాడు. తన స్కూటీ డిక్కీలో నగదు పెట్టి రాజ్ కుమార్ తాళం వేశాడు. భుజంపై పురుగు పడిందని గుర్తు తెలియని వ్యక్తి చెప్పడంతో తాళాలు స్కూటీకే ఉంచి భుజంపై దురదగా ఉండడంతో చొక్కా విప్పాడు. గుర్తు తెలియని వ్యక్తి కడుక్కునేందుకు వాటర్ బాటిల్ అందించాడు. అదే సమయంలో మరొక వ్యక్తి స్కూటీలో పెట్టిన 1.20 లక్షలు అపహరించాడు. దుండగులు నగదు, తాళంతో ఉడాయించారు. ఈ చోరీలో మొత్తం ముగ్గురు పాత్ర ఉన్నట్లు పోలీసులు సీసీ పుటేజ్ లో గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement