Thursday, April 25, 2024

ఎల్లుండి వ‌రంగ‌ల్ టూర్ వెళ్లనున్న సీఎం కేసీఆర్‌

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజాప్రతినిధుల విజ్జప్తులు, స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా.. వరంగల్ దక్షిణ భాగంలో ఔటర్ రింగ్ రోడ్డు, వరంగల్‌ జిల్లాలోని ఇతర మున్సిపాలిటీలలో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు చేప‌ట్ట‌నున్నారు.

వరంగల్, హన్మకొండ జంటనగరాల రవాణా, అభివృద్ధికి అవరోధంగా ఉన్న రైల్వే ట్రాక్ ల మీద రైల్వే వోవర్ బ్రిడ్జి ( ఆర్ వో బి) ల నిర్మాణం, తదితర అభివృద్ధి అంశాలపై స్థానిక ప్రజా ప్రతినిధులతో సమీక్షజరిపి, సీఎం కేసీఆర్ వాటిని మంజూరు చేయన్నారు.

వరంగల్ ఇంటర్నల్ రింగ్ రోడ్డు పూర్తి చేసేందుకు చేపట్టవలసిన చర్యలపై., వరంగల్ టెక్స్ టైల్ పార్క్ పనుల పురోగతి అంశాలను సీఎం సమీక్షించనున్నారు. హన్మకొండ జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సిఎం కెసిఆర్ అదే రోజు ప్రారంభించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement