Wednesday, May 15, 2024

40లక్షల మంది ఓట్లను తొలగించే కుట్ర జరిగింది.. భూమన

40లక్షల మంది ఓట్లను తొలగించే కుట్ర జరిగిందని పెగాసెస్ పై నియమించిన హౌస్ కమిటీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. పెగాసెస్ పై ఏపీ హౌస్ కమిటీ సమావేశం ముగిసింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… సేవా మిత్ర యాప్ ద్వారా సర్వే పేరుతో ఓటర్లను తొలగించే ప్రయత్నం చేశారన్నారు. తమకు ఓటు వేయరనుకునే వారి ఓట్లను తొలగించే ప్రయత్నం చేశారన్నారు. 2016 నుంచి 2019 వరకు ఈ కుట్ర జరిగిందన్నారు. డేటా చౌర్యం జరిగిందని నిర్ధారణకు వచ్చామన్నారు. దీని వెనుక పెద్ద పెద్ద వ్యక్తులున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement