Sunday, May 5, 2024

పట్టపగలే చోరి.. నమూనాలు సేకరిస్తున్న క్లూస్ టీం

తొర్రూర్ టౌన్ : బీరప్ప నగర్ లోని ఓ ప్రాంతంలో పట్టపగలే చోరీ సంఘటన జరిగింది. బాధితులు వెంకటేశ్వర్లు, భార్య మణి తెలిపిన వివరాల ప్రకారం.. మణి ఉదయమే పలువురి ఇళ్లల్లో పనిమనిషిగా చేస్తూ జీవనం సాగిస్తుంది.భర్త వెంకటేశ్వర్లు చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కాగా మణి పని నిమిత్తం బయటకు వెళ్లిందని ఉదయం 10:30 తర్వాత ఇంటికి తాళం వేసి తెలిపారు. మణి తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి తాళం వేసిన గడి కట్ చేసి ఉండడం తో వెంటనే తన భర్తకు సమాచార అందించడంతో తను కూడా ఇంటికి వచ్చాడు బీరువా తెరిచి ఉండడం బట్టలు ఇతర వస్తువులు చిందరవందరిగా ఉండడంతో 100 కు సమాచారం అందించామని తెలిపారు..

సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు కుటుంబ సభ్యుల ద్వారా సమాచారం సేకరించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం తమ పిల్లల చదువు నిమిత్తం అప్పుగా తెచ్చిన నగదు తో పాటు, తమ బంగారు ఆభరణాలు మారు ఏడు తులాలు కూడా గురయ్యాని దొంగలు ఎత్తుకు వెళ్లారని లబోదిభమంటూ చెప్పారు. వెంటనే పోలీసులు జిల్లా నుంచి క్లూస్ టీం ను పిలిపించి వస్తువులపై తలుపులు బీరువాలపై ఉన్న వేలిముద్రల నమూనాలను సేకరించారు ఈ విషయమై స్థానిక ఎస్సై లింగారెడ్డిని వివరణ కోరగా ఇంకా ఫిర్యాదు అందలేదని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement