Thursday, May 2, 2024

No Salaries : మంత్రి చెల్లుబోయిన చాంబర్ కు సిబ్బంది తాళం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు ఉద్యోగుల నుండి షాక్ ఎదురైంది. గత ఎనిమిది నెలలుగా వేతనాలను చెల్లించడం లేదంటూ సచివాలయ ఉద్యోగులు విధులకు గైర్హాజరయ్యారు. 2022 నవంబర్ నుండి వేతనాలు రావడం లేదంటూ సచివాలయంలోని ఆయన ఛాంబర్ కు తాళం వేసి నిరసన తెలిపారు. మంత్రి, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పూర్తి వేతనాలు చెల్లించే వరకు మంత్రి ఛాంబర్ తాళం తెరిచేది లేదని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement