Sunday, May 19, 2024

లారీని త‌ప్పించ‌బోయి బ‌స్సును ఢీకొట్టి.. టిప్పర్​ కింద‌ప‌డి స్కూట‌రిస్టు స్పాట్‌లోనే డెడ్‌

ప్రత్తిపాడు, (ప్రభ న్యూస్) : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఘోరం జ‌రిగింది. ప్రత్తిపాడు మండలం బొర్రావారిపాలెం దగ్గర ఓల్డ్ మద్రాస్ రోడ్ పై ప్రత్తిపాడు నుంచి వస్తున్న ద్విచక్ర వాహనదారుడు లారీని క్రాస్ చేసే సమయంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టాడు. అంత‌లోనే తన ద్విచక్ర వాహనంతో అదుపుతప్పి టిప్పర్ కిందికి వెళ్లి స్పాట్‌లోనే చ‌నిపోయాడు. మృతుడు గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట గ్రామవాసిగా గుర్తించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేసి విచారణ చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement