Thursday, April 25, 2024

బందరు పోర్టుతో మారనున్న జిల్లా ముఖచిత్రం : పేర్ని నాని

బంద‌రు పోర్టు నిర్మాణంతో జిల్లా ముఖచిత్రమే మారబోతుందని మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. ఆదివారం ఆయన బందరులో మీడియాతో మాట్లాడుతూ.. బందరు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభం కానుండడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. మహానేత వైఎస్సార్ మరణంతో బందరు పోర్టు నిర్మాణం ఆగిపోయిందన్నారు.

ఈ భూమి మీద ఉన్నంతవరకు బందరు పోర్టు ప్రజల ఆస్తి అన్నారు. ఈ పోర్టు నిర్మాణం కోసం రైతుల నుంచి బలవంతపు భూసేకరణ చేయలేదని స్పష్టం చేశారు. వందకు వందశాతం 1700 ఎకరాల ప్రభుత్వ భూమిలోనే పోర్టు నిర్మాణం జరుగుతుందన్నారు. ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళితే పోర్టు నిర్మాణం ఎప్పటికీ పూర్తి కాదని సీఎం జగన్ భావించారని, అందుకే బందరు పోర్టును ప్రభుత్వమే నిర్మిస్తుందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement