Wednesday, May 8, 2024

AP | డివైడర్ ఢీకొన్న బైకు.. స్పాట్​లోనే ఒకరి మృతి

తిరుపతి టౌన్​, (ప్రభ న్యూస్​): తిరుపతి జిల్లాలో ఘోరం జరిగింది. లక్ష్మీపురం సర్కిల్ వద్ద ఓ బైకు డివైడర్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో ద్విచక్ర వాహనదారుడు చనిపోయాడు. ఈ సంఘటన ఇవ్వాల (సోమవారం) రాత్రి జరిగింది. ఈస్ట్ ఎస్ ఐ నాగేంద్రబాబు తెలిపిన వివరాల మేరకు.. వెదురుకుప్పం మండలం బలసలగుంట గ్రామానికి చెందిన లక్ష్మయ్య కుమారుడు, చంద్రశేఖర్ (26) ద్విచక్ర వాహనంపై పల్లిక్రాస్ వద్దకు వెళ్లి తిరిగి వస్తున్నాడు.

కాగా, లక్ష్మీపురం సర్కిల్ వద్ద డివైడర్ ఢీకొట్టాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితోపాటు ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చున్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం రుయా హాస్పిటల్ కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement