Monday, April 29, 2024

ఏపీ హైకోర్టు అద‌న‌పు భ‌వ‌నానికి నేడు శంకుస్థాప‌న

అమరావతి ప్రాంతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు అదనపు భవనాన్ని నిర్మించనున్నారు. ఈ భ‌వ‌నానికి ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. ప్రస్తుత హైకోర్టు భవనంలో పూర్తిస్థాయిలో కార్యకలాపాల నిర్వహణకు చోటు సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో కోర్టు ఎదురుగా ఉన్న స్థలంలో మరో భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, ఇతర న్యాయమూర్తులు, సీఆర్‌డీఏ అధికారులు హాజరు కానున్నారు. ఈ భవనాన్ని గ్రౌండ్ ప్ల‌స్ 5 అంతస్థులుగా నిర్మించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement